
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగస్వాములవ్వాలి
నిర్మల్చైన్గేట్: బాల కార్మికు వ్యవస్థ నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి.రాధిక అన్నారు. అంతర్జాతీయ బాలకార్మిక నిర్మూలన దినోత్సవం సందర్బంగా సీ్త్ర, శిశు, వయోజనులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, బాల కార్మిక నిర్మూలన చట్టంపై అవగాహన కార్యక్రమం గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధిక ప్రత్యేక అతిథిగా హాజరై బాల కార్మిక చట్టం ముఖ్యాంశాలను వివరించారు. పిల్లల హక్కులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి దేవి మురళి, ఎస్సై సందీప్, బాలల సంరక్షణ అధికారి శ్రీనివాస్, చైల్డ్ హెల్ప్ లైన్ ఇన్చార్జ్ కోఆర్డినేటర్ గంగాధర్, మిషన్శక్తి కోఆర్డినేటర్ సబిత పాల్గొన్నారు.
నిర్మల్ నుంచి రామేశ్వరానికి బస్సు
నిర్మల్టౌన్: నిర్మల్ నుంచి రామేశ్వరానికి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు రామేశ్వరానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో అరుణాచలం గిరి ప్రదక్షిణ దర్శనం చేసుకుని నిర్మల్ చేరుకుంటుందని పేర్కొన్నారు. అలాగే 36 మంది ప్రయాణికులు ఉంటే ఎక్కడికై నా బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రయాణపు తేదీ, చార్జీ వివరాలకు 9959226003, 8328021517 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.