తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు

May 28 2025 6:09 PM | Updated on May 28 2025 6:09 PM

తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు

తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు

ఆదిలాబాద్‌: తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం జూన్‌ 14 నుంచి జూలై 13 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఐఆర్‌ సీటీసీ టూరిజం జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ కిషోర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, ప్రయాగ్‌ రాజ్‌, శృంగ్వార్‌పూర్‌ ప్రాంతాలు సందర్శించాలనుకునే వారికి గంగా రామాయణ పుణ్యక్షేత్ర ప్యాకేజీ అందుబాటులో ఉందన్నారు. ఉజ్జయిని, త్రయంబకేశ్వర్‌, మహాకాళేశ్వర్‌ వంటి ఐదు జ్యోతిర్లింగాలను దర్శించాలనుకునే ప్రయాణికులకు మరో ప్యాకేజీ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఎన్నో సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి కలవారు www. irctctourism.com వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9281030712, 9701360701, 9281495845, 9281030749, 9281030750 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement