
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
భైంసాటౌన్: నేటి ఆధునిక కాలంలో మన సంస్కృతి, సంప్రదాయాలను విస్మరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ వాటిని కాపాడుకోవాలని విశ్వమాంగళ్య సభ దక్షిణ భారత ఇన్చార్జి గాయత్రి లోమ్టే అన్నారు. గురువారం భైంసాకు వ చ్చిన ఆమె స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. మహిళలకు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలపై వివరించేందుకు విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలి పారు. ఇందులో భాగంగా మహిళలకు ధ్యా నం, ప్రాణాయామం, యోగా, శ్లోకాలు నేర్పి స్తున్నట్లు వివరించారు. తద్వారా మహిళల్లో దేశభక్తిని పెంపొందింపచేయడం, విద్యార్థి దశనుంచే బాలికలకు మాతృత్వంపై అవగా హన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. స మావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అ లివేణి, మండల అధ్యక్షులు సుష్మారెడ్డి, పట్ట ణ అధ్యక్షుడు రావుల రాము పాల్గొన్నారు.