
నీటి లభ్యత బట్టి పంటలు వేసుకోవాలి
● ముందస్తు వర్షాలు సాగుకు అనుకూలం ● మక్క, సోయా, పసుపు విత్తుకోవచ్చు ● విత్తన కొనుగోలుకు రశీదు తప్పనిసరి ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఏవో అంజిప్రసాద్
నిర్మల్చైన్గేట్: పంటల అవసరాలు, నీటి లభ్యతను బట్టి సాగును నిర్ణయించాలనీ జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ అన్నారు. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో జిల్లాలో కురుస్తున్న ముందస్తు వర్షాలు సాగుకు అనుకూలమేనని తెలిపారు. తేలికపాటి భూముల్లో ఆరు, బరువు నేలల్లో ఏడు సెంటీ మీటర్ల వర్షం కురి సి మట్టి తేమగా ఉంటే మొక్కజొన్న, సోయా, పసు పు విత్తుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో వర్షాలను అంచనా వేయలేమని, నీటి సౌకర్యం ఉన్న పంటలకై తే డోకా లేదన్నారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రశీదు తీసుకోవాలని తెలిపా రు. గురువారం నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఏవో మాట్లాడారు. ముందస్తు వర్షాలతో సాగుపై సందేహాలు, విత్తనాల ఎంపిక, ఎరువుల లభ్యతపై రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
రైతు: పసుపులో అడుగు రోగం రాకుండా ఏటువంటి చర్యలు తీసుకోవాలి? – గంగారెడ్డి, పెంబి
డీఏవో: పసుపులో అడుగు రోగం రాకుండా ట్రైకో డెర్మా విరిడిని వాడాలి. ప్రస్తుతం ఇది ఆదిలా బాదులో దొరుకుతుంది. మీరు మీ సంబంధిత ఏఈవోను సంప్రదిస్తే వారు తెప్పిస్తారు.
రైతు: ఐదు రోజులుగా వర్షం కురుస్తుంది. మొక్కజొన్న పంట వేసుకోవచ్చా?
– ముత్యం, రాచాపూర్, లక్ష్మణచాంద
డీఏవో: నీటి వనరులు అధిక మొత్తంలో ఉంటే మొ క్కజొన్న పంటకు అనుకూలం. జూన్ మొదటి వారంలో మేలైన రకం చూసి విత్తుకోవచ్చు.
రైతు: నాకు రెండెకరాల భూమి ఉంది. ఇప్పుడే పసుపు విత్తుకోవచ్చా?
– మల్లేశ్, పీచర, లక్ష్మణచాంద
డీఏవో: సందేహం లేకుండా పసుపు విత్తనాలు వేసుకోవచ్చు. ముందుగా విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తిన తర్వాత అడుగు మందులు కూడా వేసుకోవచ్చు. కత్తెర పురుగు వస్తే విషపు ఎరను తయారు చేసి చల్లాలి. అదనపు సమాచారం కోసం స్థానిక ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తే మరిన్ని సూచనలు సలహాలు ఇస్తారు.
రైతు: దాన్ 75 రకం జిల్లాలో అందుబాటులో ఉన్నాయా?
– మత్త రాజా బాబు, (మందపల్లి, పెంబి.), నారాయణ (నర్సాపూర్(జి))
డీఏవో: దాన్–75 అనే కొత్తరకం వరి విత్తనాన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ తయారు చేసింది. ఈ విత్తనాలు మార్కెట్లోకి ఇంకా రాలేదు. కానీ రాజేంద్రనగర్ యూనివర్సిటీకి వెళ్తే ఇస్తున్నారు. జిల్లాకు ఈ విత్తనాలు వస్తే రైతులందరికీ సమాచారం ఇస్తాం.
రైతు: జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? – గంగారెడ్డి, నర్సాపూర్(జి))
డీఏవో: జీలుగు విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ఈరోజు దిలావర్పూరు మండలంలో రైతులకు పంపిణీ చేశాం. ఎకరానికి 10 కిలోల జీలుగ విత్తనాలకు ఒక యూరియా బస్తా మాత్రమే వాడాలి.
రైతు: నకిలీ విత్తనాలు ఎలా గుర్తించాలి?
– రాజన్న, జామ్, సారంగాపూర్
డీఏవో: నకిలీ విత్తనాలు గుర్తించాలంటే మనం తీసుకున్న విత్తనాల పాకెట్ మీద ఉన్న లాట్ నంబర్ని బిల్లు మీద తప్పనిసరిగా రాయించా లి. అలా షాపు యజమాని రాయకపోతే అది నకిలీ విత్తనంగా భావించాలి. అలా మీ దృష్టికి వస్తే వ్యవసాయ శాఖలు అధికారులకు ఫిర్యాదు చేయాలి.
రైతు: వరిలో ఏయే విత్తనాలు మేలైనవి;
– బలరాం, లోకేశ్వరం
డీఏవో: వరిలో చాలా రకాల విత్తనాలు అందుబా టులో ఉన్నాయి. అందులో దోమ, అగ్గి తెగులు వంటి చీడపీడలను తట్టుకునే రుద్రూర్–1200, జేజీఎల్–27356, 1248, 11118, 1798, 2 –44, 5 –5204. ఆర్ఎస్ఆర్–15048, కునారం– 1638, ఎంటీ యూ–1262 రకాలు మేలైనవిగా చెప్పొచ్చు. ప్రభుత్వం సూ చించిన 33 రకాల విత్తనాలను వేసుకుంటే బో నస్ వచ్చేందుకు అవకాశం కూడా ఉంటుంది.
రైతు: మక్క, సోయా విత్తనాలు ఎప్పటి వరకు వేసుకోవచ్చు? – భూమన్న, కుంటాల
డీఏవో: ముందస్తుగా కురుస్తున్న వర్షాలు మక్క. సోయా సాగు చేసేందుకు అనుకూలమే. నేల బాగా తడిసి తేమతో ఉంటే విత్తనాలు విత్తుకోవచ్చు. జూలై 15 వరకు కూడా సాగు చేసుకోవచ్చు. విత్తనం వేసిన తర్వాత వర్షాలు లేక పోతే ఎండకు విత్తనం కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. నీటి సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచు కుంటే మంచిది.
రైతు: ఎర్రచౌక భూమిలో ఎటువంటి పంటలు వేయాలి?
– దాసరి సుజాత, విట్టాపూర్, కుంటాల
డీఏవో: ముందస్తు వర్షాలు కురుస్తున్న కారణంగా మొదట నేలని పూర్తిగా చదును చేసుకోవాలి. జూన్ మొదటి వారంలో ఎర్రచౌక భూములలో తొందరగా చేతికి వచ్చే పంటలను మాత్రమే వేసుకోవాలి.
రైతు: మా పంట పొలాల్లో నీరు బాగా నిలువ ఉంటుంది. ఈ భూమిలో ఎటువంటి పంటలు వేసుకోవచ్చు?
– శంకర్, మహాగావ్, భైంసా
డీఏవో: మొదట మీ పంట పొలాల్లో ఉన్న నీటిని నాగలి పెట్టి కాలువలు తీసి బయటకు పంపించాలి. నీరు ఆగకుండా చూసుకోవాలి. ఇటువంటి నేలలో కంది, పత్తి వంటి పంటలు వేసుకోవచ్చు.

నీటి లభ్యత బట్టి పంటలు వేసుకోవాలి