సంక్షేమంలో ముందంజ | - | Sakshi
Sakshi News home page

సంక్షేమంలో ముందంజ

Jun 3 2025 12:16 AM | Updated on Jun 3 2025 12:16 AM

సంక్ష

సంక్షేమంలో ముందంజ

నిర్మల్‌
● స్వరాష్ట్రంలో అభివృద్ధి పథం ● అన్నివర్గాలకు సమన్యాయం ● జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి ● రాష్ట్రఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య ● జిల్లాకేంద్రంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

పరేడ్‌ కమాండెంట్‌గా ఏఎస్పీ

నిర్మల్‌ టౌన్‌: హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ అవతరణ వేడుకల్లో నిర్మల్‌ ఏఎస్పీ రాజేశ్‌మీనా కమాండెంట్‌గా ప్రాతినిధ్యం వహించారు. సీఎం రేవంత్‌రెడ్డికి తన సిబ్బందితో గౌరవ వందనం చేశారు. ఎస్పీ జానకీషర్మిల అభినందించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిశారు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.

IIలోu

మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2025

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినో త్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నటరాజ కళానికేతన్‌ ఎప్పం రంజిత ఆధ్వర్యంలో సుష్మ గ్రూప్‌ సభ్యులు పేరణి నృత్యం, స్వరూపిణి నృత్య కళాక్షేత్రం నవ్య ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు అదివో అల్ల దివో.., పాడ్యాం పాండవం నిత్య శ్రేషన్‌, బన్నీ సారథ్యంలో జయహో జయహో తెలంగాణ.. రాజశేఖర్‌ డ్యాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో సాన్విత గ్రూపు కారం పొడితో కదిలిన సెల్లె.. రోకల్‌ బండతో కదిలిన పల్లె పాటకు తెలంగాణ నృత్యం.. భైంసా పట్టణానికి చెందిన శర్వాణి సంగీత నృత్య అకాడమీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని కీర్తిస్తూ నృత్యం.. శివ సాయి కళాక్షేత్రం కుభీర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి తెలిసేలా నృత్యం చేశారు. అనంతరం కళాకారులకు ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ జానకీషర్మిల బహుమతులు అందజేశారు.

డ్రగ్‌ ఫ్రీ నిర్మల్‌ లక్ష్యంగా..

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తెలిపారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లను ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, ఎస్పీ జానకీషర్మిలతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులతో కళాజాత నిర్వహించనున్నట్లు వివరించారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బాలల చట్టాలపైనా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ మూడు నెలలుగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంజా గస్తీ కార్యక్రమం చేపట్టామన్నారు. త్వరలోనే యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా కళాశాలలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

నిర్మల్‌: ‘అమరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలతో స్వరాష్ట్రం సాధించుకుని 11 ఏళ్లు నిండాయి. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌తో సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం ముందుకుసాగుతోంది’ అని రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో అధికారిక వేడుక నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ జానకీషర్మిల, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సందేశాన్ని చదివి వినిపించారు. ఎందరో అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ అన్నిరంగాల్లో దశదిశలా అభివృద్ధి చెందుతోందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాగా మారిన నిర్మల్‌లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ.. అన్నిరంగాల్లో ముందంజలో నిలిపే ప్రయత్నం కొనసాగుతోందన్నారు.

పథకాలతో ప్రజలకు లబ్ధి..

● ప్రజాప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే సంక్షేమ పథకాలను ప్రారంభించిందన్నారు. ఆర్టీసీబస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,83,85,000 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు.

● ప్రజాపాలనలో భాగంగా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామన్నారు.

● భూభారతి ద్వారా ప్రజల భూసంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించనున్నట్లు చెప్పారు. జిల్లాలో కుంటాల మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, 667భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తున్నామన్నారు.

● రైతుసంక్షేమమే ధ్యేయంగా జిల్లాలో 71,565 కుటుంబాలకు రూ.658కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతుభరోసా కింద 1.36 లక్షల మంది రైతులకు రూ.121కోట్లు ఖాతాల్లో జమచేశామని తెలిపారు.

● విద్య, వైద్యరంగాల్లో జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు రాజయ్య వివరించారు. అమ్మరక్షిత కార్యక్రమం ద్వారా 977 మంది గర్భిణులకు కౌన్సెలింగ్‌, వైద్యసేవలు, పోషణ మార్గదర్శకాలు అందించామన్నారు. ఈఏడాది పదోతరగతి ఫలితాల్లో జిల్లా 96.70 శాతం ఉత్తీర్ణత సాధించిందన్నారు.

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ప్రత్యేక చొరవతో చేపట్టిన బాలశక్తి ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని వివరించారు. ఇప్పటి వరకు 19 వేల మంది విద్యార్థులకు హెల్త్‌స్క్రీనింగ్‌ చేసి, అవసరమైన వారికి కళ్లద్దాలను అందించడం అభినందనీయమన్నారు. అలాగే నిర్మల్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జిల్లా చారిత్రక, సాహిత్య, కళానైపుణ్యాలను ప్రస్తుత తరానికే తెలిపే ప్రయత్నం చేశారన్నారు.

● జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు మహిళలు, పిల్లల కోసం పోలీసుశాఖ కృషిచేస్తోందన్నా రు. ఎస్పీ జానకీషర్మిల ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో తొలిసారి మహిళాకానిస్టేబుళ్లతో శివంగిటీమ్‌ను తయారు చేయడం ప్రశంసనీయమన్నారు.

● గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రస్థాయిలో ఎన్నోవిజయాలను సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. బ్యాంకు లింకేజీ రుణాల రికవరీలో రాష్ట్రస్థాయిలో మళ్లీ మొదటి స్థానం సాధించడం, సమీకృత వ్యవసాయానికి పెప్సికో పురస్కారం అందడం అభినందనీయమన్నారు.

అన్నిశాఖల ద్వారా ఆయారంగాల్లో వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనసూయ సీతక్క, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. .

దుబాయ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ఖానాపూర్‌: దుబాయ్‌లోని జేబల్‌ అలీ ప్రాంతంలో ఆదివారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గల్ఫ్‌ కార్మికులు తెలంగాణ తల్లి చిత్రపటం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు సాగర్‌, లక్ష్మణ్‌, గంగాధర్‌, రాకేశ్‌, వినయ్‌, పవన్‌సాయి, పెద్ది రవి తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

నేటి నుంచి టెన్త్‌

సప్లిమెంటరీ పరీక్షలు

నిర్మల్‌ రూరల్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో 312 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, సోమవార్‌పేట్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షలు సీసీ కెమెరా పర్యవేక్షణలో జరగనున్నాయి. హాల్‌ టికెట్లు ఇప్పటికే విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని జిల్లా పరీక్షల అధికారి పరమేశ్వర్‌ తెలిపారు.

సంక్షేమంలో ముందంజ1
1/9

సంక్షేమంలో ముందంజ

సంక్షేమంలో ముందంజ2
2/9

సంక్షేమంలో ముందంజ

సంక్షేమంలో ముందంజ3
3/9

సంక్షేమంలో ముందంజ

సంక్షేమంలో ముందంజ4
4/9

సంక్షేమంలో ముందంజ

సంక్షేమంలో ముందంజ5
5/9

సంక్షేమంలో ముందంజ

సంక్షేమంలో ముందంజ6
6/9

సంక్షేమంలో ముందంజ

సంక్షేమంలో ముందంజ7
7/9

సంక్షేమంలో ముందంజ

సంక్షేమంలో ముందంజ8
8/9

సంక్షేమంలో ముందంజ

సంక్షేమంలో ముందంజ9
9/9

సంక్షేమంలో ముందంజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement