
చెరువుల వద్ద పర్యాటకుల సందడి
మామడ: మండలంలోని తుర్కం, యెంగన్న చె రువుల వద్దకు పర్యాటకులు తరలివచ్చారు. హై దరాబాద్ నుంచి వచ్చి ఎకో టూరిజం ద్వారా చె రువులను సందర్శించారు. విధి ఫౌండేషన్కు సంబంధించిన సభ్యులు, వలంటీర్లు చెరువుల వద్దకు శనివారం రాత్రి చేరుకుని అట వీశాఖ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చే శారు. ఆదివారం సఫారీ వాహనంలో చెరువుల వద్దకు చేరుకుని సమీపంలో ఉండే పక్షులను కె మెరాల్లో బంధించారు. ప్రకృతి అందాలు తిలకించారు. ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన గ్రేహె డ్ ఫిష్, ఈగల్, విష్లింగ్ డక్, పైడ్ కుకూ పక్షుల ను గుర్తించారు. అటవీ ప్రత్యేకత పర్యాటకులకు అధికారులు వివరించారు. ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రావు, ఎఫ్బీవో సరిత, సిబ్బంది ఉన్నారు.
తుర్కం చెరువు వద్ద పర్యాటకులు