
పీఎస్సార్ను కలిసిన మీనాక్షి నటరాజన్
మంచిర్యాలటౌన్: మంత్రి పదవి ఆశించి భంగపడిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావును ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కలిశారు. పీఎస్సార్కు కాకుండా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడంతో వారి ద్దరూ ఆయనను కలిసి బుజ్జగింపు యత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, మొదటి నుంచి పార్టీని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాపాడుకుంటూ వచ్చిన పీఎస్సార్కే మంత్రి పదవి వస్తుందని పార్టీ నాయకులంతా భావించారు. తీరా పదవి రాకపోవడంతో ఆయన వర్గీయుల్లో నైరాశ్యం నెలకొంది.