
బాల్య వివాహమంటూ తప్పుడు ఫిర్యాదు
ఖానాపూర్: మండలంలోని మేడంపల్లి గ్రామంలో ఆదివారం మైనర్ను ఇదే గ్రామానికి చెందిన యువకుడికిచ్చి బాల్యవివాహం చేస్తున్నట్లు ఎవరో 1098 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చే శారు. దీంతో ఐసీపీఎస్, ఐసీడీఎస్, పోలీస్శాఖ అ ధికారులు శనివారం రాత్రి మేడంపల్లి గ్రామానికి చే రుకున్నారు. మైనర్లకు వివాహం చేయవద్దని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అయితే సదరు కు టుంబీకులు తమ కుమార్తె మేజర్ అని, ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు అధికారులకు చూపించారు. అయితే ఇది ఆకతాయిల పనిగా భా వించిన అధికారులు వెనుదిరగడంతో ఆదివారం యువతి వివాహాన్ని జరిపించారు. దీంతో ఇరు కుటుంబాలవారు ఊపిరిపీల్చుకున్నాయి.
● మేజర్గా తేలడంతో జరిగిన పెళ్లి