వైభవంగా గజ్జలమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

వైభవంగా గజ్జలమ్మ జాతర

Jun 9 2025 12:58 AM | Updated on Jun 9 2025 12:58 AM

వైభవంగా గజ్జలమ్మ జాతర

వైభవంగా గజ్జలమ్మ జాతర

కుంటాల: మండల కేంద్రంలోని శ్రీగజ్జలమ్మ జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవా రికి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించి ఉల్లి గడ్డలు, ఓమ, పేలా లు, పుట్నాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గజ్జ లమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్లకూ నైవేద్యం సమర్పించారు. పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామారావు పటేల్‌ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కుంటాలకు చెందిన జుట్టు శ్రీధర్‌ దంపతులు అమ్మవారికి గ్రాము బంగారు ముక్కుపుడక బహూకరించారు. ఆలయ కమిటీ ఆ ధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు.

పుష్కరిణి ప్రారంభం

కుంటాల మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు అల్లాల శారద–శ్రీనివాస్‌రావు దంపతులు గజ్జలమ్మ ఆలయ ఆవరణలో పుష్కరిణి నిర్మించగా వేద పండితుడు గురుమంచి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. గోదావరి నది జలాలతో కోనేరులో శిఖరంపై గజ్జలమ్మ విగ్రహాన్ని ఉంచి అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఆలయానికి పోటెత్తిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement