
ప్రజాధనం పట్టదా?
ఈ ఫొటోలూ.. సోన్ మండలం శాకెర వద్ద స్వర్ణనదిపై నిర్మించిన చెక్డ్యామ్కు సంబంధించినవి. ఇటీవల ఈ డ్యామ్లో కొంత భాగాన్ని పేల్చివేయడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగానూ విమర్శలకు దారితీసింది. ప్రతీ వానాకాలంలో స్వర్ణ నీరు వృథాగా గోదావరిలో కలిసిపోతోంది. ఈ నీటిని ఒడిసిపట్టి పంటలకు అందించడంతో పాటు నిర్మల్ పట్టణానికి కొంతమేర తాగునీటిని అందించేందుకు 2016లో రూ.4.60కోట్లతో 175మీటర్ల పొడవుతో శాకెర శివారులో చెక్డ్యామ్ నిర్మించారు. అయితే.. రెండేళ్ల క్రితం సిద్ధాపూర్ సమీపంలోని జీఎన్ఆర్ కాలనీ జలప్రళయంలో చిక్కుకోవడానికి ఈ చెక్డ్యామే కారణం కావచ్చంటూ వాదనలు మొదలయ్యాయి. శాసీ్త్రయంగా ఎంతవరకు సమంజసమనేది తేలలేదు. మరోవైపు రూ.కోట్లు పెట్టి కట్టేముందు ఈ డ్యామ్తో ఎలాంటి ముంపు ఏర్పడుతుందన్న అంచనా వేయలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ముంపు ప్రాంతంలో నివాసం ఉండేందుకు జీఎన్ఆర్ కాలనీకి ఎవరు, ఎలా అనుమతిచ్చారన్న విషయమూ మరోసారి చర్చకు వస్తోంది.
నిర్మల్: ఏ అభివృద్ధి పని చేపట్టాలన్నా ప్రభుత్వాని కి పక్కా లెక్కలుంటాయి. ఎలాంటి అంచనాలు, ముందస్తు లెక్కలు వేయకుండా పనులు చేపట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కాదు. ఏ నిర్మాణాలు చేయాలన్నా.. ముందుగా వాటితో కలిగే లాభనష్టాలను లెక్కవేసుకున్న తర్వాతే చేపట్టాల్సి ఉంటుంది. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లేకుంటేనే పనులు ముందుకు సాగాలి. కానీ.. ఇటీవల కొంతభా గం పేల్చేసిన శాకెర చెక్డ్యామ్ విషయంలో అధికా రులు అవేమీ పట్టించుకోలేదా? గాలికి కట్టేశారా? అని జిల్లావాసులు వాదన లేవనెత్తుతున్నారు.
కూల్చివేతపై భిన్న వాదనలు
ఎక్కడ ఏ డ్యామ్నిర్మించాలన్నా కచ్చితంగా ముంపు ప్రాంతాలను అంచనా వేయాల్సి ఉంటుంది. ని ర్మల్ సమీపంలో శాకెరలోనూ అలాగే నిర్మించారు. కానీ.. పైభాగంలోగల జీఎన్ఆర్ కాలనీ మూడేళ్లుగా వరదనీటిలో మునుగుతోంది. ఈ కారణంగా ఈ కాలనీకి దిగువన స్వర్ణ నదిలో గల చెక్డ్యామ్ ఎత్తు తగ్గిస్తే ముంపు తగ్గుతుందంటూ ఓ వాదన మొదలైంది. దీంతో ముంపు ప్రభావం తగ్గుతుందంటూ కొంతమంది ఈ అభిప్రాయాన్ని బలంగా తీసుకువచ్చారు. అసలు.. జీఎన్ఆర్ కాలనీ మునగడానికి ఈ చెక్డ్యామే కారణమంటూ శాసీ్త్రయంగా తేల్చకుండా నే కూల్చారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కాలనీవాసుల క్షేమం కోసం చేపడుతున్న పనుల్లో భాగంగా ఈ పని చేశామంటూ ప్రభుత్వం తరఫున సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఎలా అనుమతులిచ్చారో!
ఎగువన ప్రాజెక్టు, దిగువన వానాకాలంలో ఉధృతంగా ప్రవహించే గోదావరి నది పరీవాహకంలో, అది కూడా ముంపు ప్రాంతంలో ప్రజలు నివాసం ఉండేలా ఓ కాలనీకి ఎలా అనుమతులిచ్చారన్న వా దన ఇప్పటికీ ఉంది. ఈ వెంచర్ ప్రారంభంలోనే అప్పటి నిర్మల్ మున్సిపల్ కమిషనర్ దీన్ని అడ్డుకు నే ప్రయత్నం చేయగా, రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి మరీ ఇక్కడ వెంచర్ ఏర్పాటు వేశారు. అప్పట్లో ఏమాత్రం ముందుచూపు లేకుండా నది ఒడ్డునే ప్లా ట్లు చేశారు. ఊరికి కాస్త దూరమైనా.. తమకు అనుకూల ధరలో రావడంతో చాలామంది మధ్యతరగ తి కుటుంబీకులు అక్కడ ప్లాట్లు కొనుక్కుని ఇళ్లు క ట్టుకున్నారు. మూడేళ్లుగా ముంపు కష్టాలెదురవుతుండగా వారంతా లబోదిబోమంటున్నారు. ఇలా జరుగుతుందని ముందే చెబితే.. ఇక్కడ ప్లాట్లు కొని ఇళ్లు కట్టేవాళ్లమే కాదని వాపోతున్నారు. తమకు ముంపు సమస్య లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇదే నదికి ఓవైపు ఉన్న జీఎన్ఆర్ కాలనీ మూడేళ్లుగా మునుగుతుండగా, మరోవైపు ముంపు ప్రాంతంలోనే డబుల్బెడ్రూంలు ఎలా నిర్మించారన్న వాదనా చర్చకు వస్తోంది.
ఇటీవల కొంతభాగం పేల్చి కూల్చిన చెక్డ్యామ్
రూ.లక్షలు వెచ్చించేది కూల్చడానికా?
పేల్చివేతలకు బాధ్యులు ఎవరో?
పాలకులు, అధికారుల్లో తప్పెవరిది?
ముంపు తప్పుతదనే గ్యారంటీ ఏది?
చెక్డ్యామ్ కూల్చడంపై భిన్నవాదనలు
ఇరువర్గాల మాటల యుద్ధం
జీఎన్ఆర్ కాలనీకి ముంపు తప్పించేందుకు చేపడుతున్న పనుల్లో భాగంగానే పాలనపరమైన ఆదేశాలతో శాకెర చెక్డ్యామ్లో కొంతభాగంలో ఎత్తు తగ్గించేందుకు పేల్చివేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జీఎన్ఆర్ కాలనీ ముంపు వెనుక ఒకప్పటి పాలకులు ఉన్నారంటూ ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఆరోపిస్తుంటే.. తాజాగా చెక్డ్యామ్ పేల్చివేతపై ప్రజా ధనం వృథా చేస్తున్నారంటూ మాజీ ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, మా జీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వర్గాల మధ్య మా టలయుద్ధం కొనసాగుతోంది. అసలు.. శాకెర చెక్డ్యామ్ ఎత్తు తగ్గించడంతో వరద ముంపు తప్పుతుందా? అనే విషయమై ఎవరూ స్పష్టతనివ్వడం లేదు. ఈ సీజన్లో వచ్చే వర్షాలే ఏది సరైన నిర్ణయమో తేల్చాల్సి ఉంది.

ప్రజాధనం పట్టదా?