
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో..
నిర్మల్చైన్గేట్/భైంసాటౌన్/ఖానాపూర్: జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ కార్యాలయంలో ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ముధోల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రామారావుపటేల్, ఖానాపూర్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జాతీయ పతాకాలు ఎగురవేశారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రజాసంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ప్రభుత్వం ఆదర్శంగా నిలుపుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ సిందే ఆనంద్రావు, ఏఎస్పీ అవినాష్కుమార్ జెండా ఆవిష్కరణలు చేశారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో..

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో..