
మూగజీవాలపాలిట.. మృత్యుపాశాలు
● అప్రమత్తతతోనే ప్రమాదాలు నివారించవచ్చంటున్న అధికారులు ● తీగలు తెగితె వెంటనే సమాచారం ఇవ్వాలని సూచన
లక్ష్మణచాంద: వర్షాకాలంలో విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను అరికట్టవచ్చని వి ద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యంతో మూగజీవాలు మృత్యువాతపడుతున్నాఇ. ఆస్తి నష్టం జరుగుతోంది. తెగిపడిన విద్యుత్ తీగలను తాకడం, సొంతంగా మరమ్మతులు చేయడం వంటి వి ప్రమాదకరమని, ఏదైనా సమస్య తలెత్తితే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని నిర్మల్ విద్యుత్ శాఖ డీఈ డి.నాగరాజు సూచించా రు. రైతులు, విద్యుత్ వినియోగదారులు వర్షాకా లంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సలహాలు ఇచ్చారు.
విద్యుత్ తీగలతో అప్రమత్తం
తెగిన తీగలను తాకొద్దు: విద్యుత్ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా లేదా లూజుగా ఉన్నా వాటిని తాకకూడదు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
తడి బట్టలు ఆరవేయొద్దు: ఇండ్లలో విద్యుత్ తీగలపై తడి బట్టలు ఆరవేయడం వల్ల షాక్ సంభవించే ప్ర మాదం ఉంది. జీఐ దండెం వైర్లలో ఇన్సులేషన్ సరి గ్గా లేకపోతే విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది.
రేకులతో జాగ్రత్త: ఇంటి ముందు స్టీల్ రేకులు విద్యుత్ తీగలకు తాకకుండా చూసుకోవాలి, ఎందుకంటే వీటికి కూడా విద్యుత్ సరఫరా జరిగే అవకా శం ఉంది.
పశువులను కట్టవద్దు: ఇనుప విద్యుత్ స్తంభాలకు పశువులను కట్టివేయడం మానుకోవాలి, ఇది ప్రమాదకరం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సర్వీస్ వైర్ల సమస్య: వర్షాకాలంలో సర్వీస్ వైర్లకు కార్బన్ వచ్చి విద్యుత్ సరఫరా సరిగ్గా జరగకపోతే, వాటిని మార్చుకోవాలి.
విద్యుత్ తీగల దూరం: ఇండ్లకు ఆనుకొని విద్యుత్ తీగలు లేకుండా చూసుకోవాలి.
ఎర్తింగ్ ఏర్పాటు: ఇంటి విద్యుత్ వైరింగ్కు సరైన ఎర్తింగ్ ఏర్పాటు చేయాలి. తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్ వైర్లను తాకకూడదు.
సెల్ఫోన్ జాగ్రత్తలు: చార్జింగ్లో ఉన్న సెల్ఫోన్తో మాట్లాడటం, తడి చేతులతో స్విచ్ ఆఫ్ చేయడం వంటివి నివారించాలి. చేతులను గుడ్డతో తుడిచి స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత చార్జింగ్ వైర్ తీయాలి.
ప్రమాద సమయంలో చర్యలు
విద్యుత్ షాక్ నివారణ: ఎవరైనా విద్యుత్ షాక్కు గురైతే, ఆత్రుతగా వారిని తాకకూడదు. విద్యుత్ ప్రవహించని కర్ర లేదా ప్లాస్టిక్ వస్తువులతో వారిని విద్యుత్ సంబంధం నుంచి వేరు చేయాలి.
సొంత మరమ్మతులు వద్దు: సొంతంగా విద్యుత్ మరమ్మతులు చేయడం వల్ల ప్రాణాంతక ప్రమాదాలు సంభవించవచ్చు. ఎల్లప్పుడూ విద్యుత్ శాఖ సిబ్బంది సహాయం తీసుకోవాలి.
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు నివారించడాని కి రైతులు, వినియోగదారులు పై సూచనలను కచ్చి తంగా పాటించాలని డీఈ నాగరాజు సూచించారు. విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉండడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఏదైనా సమస్య తలెత్తితే విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు.
జాగ్రత్తలతో ప్రమాదాలకు దూరం
వర్షకాలంలో రైతులు, విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా ఉంటే విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిన, లూజ్గా ఉన్నా, ట్సాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు పోయినా సిబ్బందికి తెలియచేయాలి. వెంటనే తమ సిబ్బంది సరి చేస్తారు. ఏ సమస్య వచ్చినా తమ సిబ్బందికి సమాచారం ఇస్తే వెంటనే సరిచేస్తాం.తెలిసీ తెలియక సొంతంగా మరమ్మత్తుతులు చేపట్టి ప్రమాదాల భారీన పడొద్దు. మా సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారిస్తారు.
– డి.నాగరాజు, డీఈ నిర్మల్
కడెం మండలంలోని గంగాపూర్ గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్కుగురై ఆరు ఎడ్లు మృతి చెందాయి.
లక్ష్మణచాంద మండలం పార్పెల్లి తాండాలో విద్యుత్ షాక్తో నాలుగు రోజుల క్రితం గేదెలు మృతిచెందాయి. గడిచిన నెల రోజుల్లో విద్యుత్షాక్తో పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాతపడ్డాయి.
రైతులకు ప్రత్యేక సూచనలు
ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు: పంట చేనుల్లో ట్రాన్స్ఫార్మర్లను కనీసం 6 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలి.
గడ్డి నివారణ: విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద గడ్డి లేకుండా చూసుకోవాలి. ఇది పశువులను ఆకర్షించకుండా ప్రమాదాలను నివారిస్తుంది.
పశువుల జాగ్రత్త: పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి.
ఫెన్సింగ్ నిబంధనలు: పంటల చుట్టూ అటవీ జంతువుల రక్షణ కోసం ఏర్పాటు చేసే ఫెన్సింగ్కు విద్యుత్ సరఫరా చేయడం చట్టవిరుద్ధం. రైతులు దీనిని నివారించాలి.
చేపల పట్టుట: చేపలు పట్టడానికి విద్యుత్ వినియోగించడం కూడా చట్టవిరుద్ధం. ఇటువంటి చర్యలకు పాల్పడరాదు.

మూగజీవాలపాలిట.. మృత్యుపాశాలు