గోవులు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

గోవులు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు

May 30 2025 1:50 AM | Updated on May 30 2025 1:50 AM

గోవుల

గోవులు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు

● జిల్లా సరిహద్దులో ఏడు చెక్‌ పోస్టులు ● ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌టౌన్‌: గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకీషర్మిల హెచ్చరించారు. గోవుల రవాణా విషయంలో వెటర్నరీ డాక్టర్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. గో వుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లా సరిహద్దులో ఏడు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపా రు. సోన్‌ మండలం గంజాల్‌ టోల్‌ ప్లాజా వద్ద ఏ ర్పాటు చేసిన చెక్‌పోస్టును, కొండాపూర్‌ సెంట్‌థామస్‌ స్కూల్‌ వద్ద గల చెక్‌ పోస్టును గురువారం ఎస్పీ తనిఖీ చేశారు. సిబ్బందికి తగు సూచనలు చే శారు. గోవుల రవాణాను అడ్డుకునేందుకు నిరంతర పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక చెక్‌ పోస్టులలో పోలీ సు, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గోవుల రవాణా విషయంలో వివాదాలు తలెత్తకుండా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చెక్‌ పోస్ట్‌ల వద్ద ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు.

రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు..

పండుగల సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో మత సామరస్యానికి భంగం కలిగించేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా, అస భ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వార్నింగ్‌ ఇచ్చారు. అంతేకా కుండా జిల్లా ముఖ్య కార్యాలయంలో సోషల్‌ మీడియా సెల్‌ ప్రత్యేకంగా పరిశీలన చేస్తుంటారని తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

బక్రీద్‌ పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చోట్ల ముందస్తుగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మతపెద్దలతో పీస్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి, భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు.

పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి

భైంసాటౌన్‌: ప్రజలు పండుగలను ప్రశాంత వాతా వరణంలో జరుపుకోవాలని ఏఎస్పీ అవినాష్‌కుమా ర్‌ అన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ సమావేశ మందిరంలో హిందూ, ముస్లిం మతపెద్దలతో పీస్‌ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్‌ పండు గ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు నమ్మవద్దని, ఏదైనా సమస్య తలెత్తితే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు సహించేది లేదన్నారు. ఆర్డీవో కోమల్‌రెడ్డి మాట్లాడుతూ.. పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ బి.రాజేశ్‌కుమార్‌, తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, సీఐ గోపీనాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

బక్రీద్‌ శాంతియుతంగా నిర్వహించుకోవాలి

ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్నకల్యాణి

నిర్మల్‌టౌన్‌: బక్రీద్‌ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని నిర్మల్‌ జిల్లా ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్న కల్యాణి సూచించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రానున్న బక్రీద్‌ పండుగకు మున్సిపల్‌, గ్రామపంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్‌, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమంగా గోవులను వధిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, అర్బన్‌ తహసీల్దార్‌ రాజు, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌, అన్నివర్గాల ప్రజలు పాల్గొన్నారు.

గోవులు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు1
1/1

గోవులు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement