
నిర్మల్
అంతర్జాతీయ సదస్సులో..
ఐఐటీ హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంలో బాసర ఆర్జీయూకేటీ నుంచి 35 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
8లోu
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రుతిక్కుమార్ ప్రతిభ
కుంటాల: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన అట్టోలి రుతిక్కుమార్ ప్రతిభ కనబర్చాడు. కుంటాలకు చెందిన చింత ప్రభ–అట్టోలి సంజీవ్కుమార్ దంపతుల రెండో కుమారుడు రుతిక్కుమార్ సోమవారం వెలువడిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 874 ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 137 ర్యాంకు సాధించాడు. తండ్రి సంజీవ్ కుమార్ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మామడ మండలంలో వాటర్షెడ్ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. తల్లి ప్రభ కుభీర్ మండలంలోని గోడాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. రుతిక్ ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు నిర్మల్ వాసవి పాఠశాలలో, ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదివి పరీక్షలు రాసి అర్హత సాధించాడు.
సతీశ్.. ఊళ్లో ఉంటే పిల్లల చదువులకు కష్టమవుతుందని కుటుంబంతో కలిసి నిర్మల్ వచ్చి అద్దెకుంటున్నాడు. ఉన్న పొలం కౌలుకు ఇచ్చి, జిల్లాకేంద్రంలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా కష్టపడుతున్నాడు. భార్య టైలరింగ్ చేస్తూ చేదోడుగా నిలుస్తోంది. పాప, బాబు ఇద్దరినీ పేరున్న స్కూల్లోనే వేశారు. ఈమధ్య సరైన మార్కెట్ లేకపోవడంతో ఉద్యోగం, పార్ట్టైం సంపాదన ఇబ్బందికరంగా మారింది. ఇంతలోనే జూన్ రానే వచ్చింది. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలంటే ఆ స్థాయిలో ఫీజుల చెల్లింపులు చదివించాల్సిందే. ఏ ఉద్దేశంతోనైతే ఊరు వదిలి పట్టణం వచ్చామో..! అది నెరవేరుతుందా..! అన్న డైలామాలో పడిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేసేది ఫీజుల కోసం బంగారం తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. బడీడు పిల్లలున్న ప్రతీ ఇంట్లో ఇప్పుడు వారి చదువులు, ఫీజుల ముచ్చటే నడుస్తోంది.
నిర్మల్: పాఠశాలలు మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల గుండెల్లో ఆందోళన పెరుగుతోంది. పరిమిత వసతులు, సామాన్యమైన బోధనా పద్ధతులతో నడిచే ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపేందుకు ఇష్టపడక, అధిక ఫీజులతో కూడిన ప్రైవేటు చదువులు కొనేందుకు కష్టపడుతున్నారు. విద్యా వ్యవస్థ వ్యాపారంగా మారడం, ఫీజుల భారం, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు తల్లిదండ్రులను కలవరపరుస్తున్నాయి.
తల్లిదండ్రులకు ఆర్థిక భారం
విద్యా సంవత్సరం ఆరంభం అంటేనే తల్లిదండ్రులకు ఆందోళన మొదలవుతుంది. పుస్తకాలు, యూ నిఫామ్లు, బస్సు ఛార్జీలు, పరీక్ష ఫీజులు, వార్షిక ఫీజులు వంటి ఖర్చులు ఒక్క నెలలోనే కుటుంబ ఆదాయాన్ని గణనీయంగా ఖాళీ చేస్తున్నాయి. చాలామంది తల్లిదండ్రులు ఏడాది పొడవునా కష్టపడి సంపాదించిన డబ్బును ఇందుకోసం వెచ్చించాల్సి వస్తోంది. కొంతమంది తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేయడం, ఆస్తులను అమ్మడం వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కొరత, బోధనా నాణ్యతలో లోపాలు తల్లిదండ్రులను ప్రైవేటు పాఠశాలల వైపు నెట్టివేస్తున్నాయి. అయితే, ఈ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి, అధిక ఫీజులతో తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయి.
పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తు..
ప్రస్తుత పోటీ యుగంలో పిల్లలు విజయవంతం కావాలంటే నాణ్యమైన విద్య అవసరమని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ ఆలోచనతో, చాలామంది తమ పిల్లలను జిల్లా స్థాయి నుంచి హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు పంపి, హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. ఐదు, ఆరు తరగతుల నుంచే ఈ ప్రయాణం మొదలవుతోంది. ఆర్థికంగా స్థిరంగా ఉన్న కుటుంబాలకు ఈ ఖర్చులు పెద్ద భారం కాకపోవచ్చు, కానీ పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ఆర్థిక ఒత్తిడిని భరించలేక నలిగిపోతున్నాయి. ‘పిల్లలకు మంచి చదువు అందిస్తే ఆస్తులు లేకపోయినా భవిష్యత్తు బాగుంటుంది‘ అనే ఆలోచనతో ఎన్ని కష్టాలైనా భరిస్తూ ముందుకు సాగుతున్నారు.
‘క్యాష్’ చేసుకుంటున్న స్కూళ్లు..
తల్లిదండ్రుల ఈ ఆవేదనను, ఆశలను కొన్ని ప్రైవేటు పాఠశాలలు నగదుగా మార్చుకుంటున్నాయి. ‘వరల్డ్, ఒలింపియాడ్, టెక్నో, ఐఐటీ, ప్రైమ్‘ వంటి ఆకర్షణీయమైన పేర్లతో, తాము ప్రత్యేకమైన విద్యను అందిస్తున్నామని ప్రచారం చేస్తూ, విద్యా చట్టాలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రుల బలహీనతను ఈ పాఠశాలలు వినియోగించుకుంటున్నాయి. ఈ పాఠశాలలపై నియంత్రణ లేకపోవడం, బాధ్యతాయుతమైన అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఫలితంగా, ప్రైవేటు పాఠశాలలు తమ ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ, తల్లిదండ్రులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి.
కరాటే బెల్ట్లు ప్రదానం
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఝాన్సీలక్ష్మీబాయి ఉచిత కరాటే శిక్షణలో 30 రోజులుగా బాలికలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. మంగళవారం కరాటే బెల్ట్ గ్రేడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 11 మంది బాలికలకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తేజేందర్సింగ్ భాటియా, ఉపాధ్యక్షుడు కొండాజీ శ్రీకాంత్, అమ్ముల భూషణ్, కరాటే శిక్షకురాలు మృణాళిని, తదితరులు పాల్గొన్నారు.
న్యూస్రీల్
త్వరలో పాఠశాలల పునఃప్రారంభం ఏటా పెరుగుతున్న ఫీజులు మంచిచదువు పేరిట వల ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్
నిర్మల్టౌన్: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జూన్ 1 నుంచి 30 వరకు 30 పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ జానకీషర్మిల మంగళవారం తెలిపారు. పబ్లిక్ మీటింగ్లు, ఊరేగింపులు ధర్నాలకు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. నిషేధిత ఆయుధాలు, తుపాకులు, పేలుడు పదార్థాలు వాడరాదన్నారు. డీజేలు , లౌడ్ స్పీకర్ వంటివి పెట్టొద్దని తెలిపారు. ఈ సమయంలో నియమాలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ కింద శిక్ష అనుభవిస్తారని వెల్లడించారు.
విద్యార్థుల నమోదుకు కళాజాత
అమలు కాని ఉత్తర్వులు
నిబంధనలు పాటించాలి..
ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించాలి. ఫీజులను ఇష్టారీతిన పెంచడానికి లేదు. ఈ విద్యాసంవత్సరం వీటిపై దృష్టిపెడతాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిసదుపాయాలతో విద్యనందిస్తున్నాం.
–రామారావు, డీఈవో
ఫీజుల నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేటు పాఠశాలల ఆగడాలు అంతేలేకుండా పోయాయి. 2017 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ తిరుపతిరావు నేతత్వంలోని ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2018 మార్చిలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తూ ఏటా 10 శాతం ఫీజులను పెంచుకోవచ్చునని ప్రతిపాదనలు చేసింది. కానీ ఇంత వరకు ఆ కమిటీ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. 2020 ఏప్రిల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు నంబర్ 46ను జారీ చేసింది. జీవో నంబర్ 01 ప్రకారం ట్యూషన్ ఫీజులను నియంత్రించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కానీ, ఉత్తర్వుల అమలుకు విద్యాశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మొదలుకుని మండల విద్యాశాఖ అధికారులకు వరకు ఒక్కరు కూడా ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసిన దాఖలాలు లేవు. అధికారుల తీరుపై అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో తరగతుల వారీగా నెలకు స్కూళ్ల ఫీజులు(రూ. లలో)..
తరగతి కనిష్టం గరిష్టం
నర్సరీ 800 1,200
1వ 950 1,800
2వ 1,000 2,000
3వ 1,100 2,500
4వ 1,200 3,000
5వ 1,300 3,000
6వ 1,350 3,500
7వ 1,400 4,000
8వ 1,500 4,000
9వ 1,550 4,500
10వ 1,600 5,000

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్