
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి
● డీఈవో రామారావు
నిర్మల్ రూరల్: వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని డీఈవో రామారావు సూచించారు. డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల ప్రారంభం నాటికి బడులన్నిటినీ శుభ్రపరచి రెడీ చేయాలన్నారు. ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇందులో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే వసతులు, సౌకర్యాలను వివరించాలని సూచించారు. ఇందులో అధికారులు రమణారెడ్డి, సమన్వయకర్తలు రాజేశ్వర్, నరసయ్య, ప్రవీణ్కుమార్, సలోమి కరుణ, శ్రావణి, మహేశ్వర్, కృష్ణవేణి, ఎంఈవోలు పాల్గొన్నారు.