
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
కడెం: నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడి సాధ్యమని జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా.శేషు, మండల వ్యవసాయాధికారి పి.దినేశ్ అన్నారు. మండలంలోని పెద్దబెల్లాల్ రైతు వేదికలో ‘నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం’ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. సాగులో నాణ్యమైన విత్తనం ప్రాముఖ్యతను రైతులకు తెలియజేశారు. విత్తనాలను పంపిణీ చేశారు. ఇందులో ఏఈవోలు నవీన్, జె.సాయికృష్ణ, డి.శాలిని, రైతులు పొద్దుటూరి సంతోష్ రెడ్డి, అకుల శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.