
● కొన్ని నిర్మాణ దశలో.. ● మరికొన్ని శిథిలావస్థలో.. ● తా
ఖానాపూర్ :ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్, అంబేడ్కర్ నగర్ శివారు ప్రాంతాల్లో రెంకొని వాగుపై సుమారు రూ.10 కోట్లతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. అధికారుల అలసత్వం కారణంగా తుది దశ పనులు సకాలంలో పూర్తి కాలేదు. ఈ వంతెన 20కి పైగా గ్రామాలతోపాటు మంచిర్యాల, జన్నారం వైపు వెళ్లే ప్రధాన రహదారిగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో చిన్నపాటి వరదలకే గతంలో తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు నెలల తరబడి రాకపోకలు నిలి చిపోయాయి. ఈ ఏడాది కూడా వానాకాలం మొదలైనా వంతెన పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
సుభాష్నగర్లో..
సుభాష్నగర్ శివారులో హైటెక్ సిటీకి వెళ్లే మార్గంలో వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు మీదుగా వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ ఏడాది కూడా ఆ పరిస్థితి తప్పేలా లేదు. గతంలో వర్షాల కారణంగా ఈ రోడ్డు పలుమార్లు కొట్టుకుపోయాయి. దీంతో వాగు అవతలి వైపున ఉన్న మైనారిటీ స్కూల్ విద్యార్థులు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సరిహద్దు గ్రామాల్లో
లో–లెవల్ వంతెనలు..
తానూరు : మహారాష్ట్ర సరిహద్దులోని ఝరి(బి), ఝరి(బి) తండా, మొగ్లి, మసల్గా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో లో–లెవల్ వంతెనల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే వాగులో వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. పొలాలు, చేల వద్దకు ఎరువులు తీసుకెళ్లడం కష్టమవడంతో రైతులు ముందస్తుగా నిల్వలు చేసుకుంటున్నారు. భారీ వర్షాలు కురిస్తే మొగ్లి, మసల్గా గ్రామాల నుంచి మండల కేంద్రమైన తానూరుకు చేరాలంటే 10 కిలోమీటర్లు చుట్టుకోవాల్సి వస్తోంది. అధికారులు హైలెవల్ వంతెనలు నిర్మించి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.

● కొన్ని నిర్మాణ దశలో.. ● మరికొన్ని శిథిలావస్థలో.. ● తా

● కొన్ని నిర్మాణ దశలో.. ● మరికొన్ని శిథిలావస్థలో.. ● తా