పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య

May 28 2025 6:09 PM | Updated on May 28 2025 6:09 PM

పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య

తాంసి: మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కప్పర్లకు చెందిన అనుప నారాయణ (32) వ్యవసాయకూలీగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఉదయం మద్యం సేవించి పంటచేనుకు వెళ్లాడు. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చేను యజమానికి సమాచారం ఇచ్చాడు. యజమాని చేను వద్దకు వెళ్లేసరికి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అంబులెన్సులో రిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌చార్జి ఎస్సై రాధిక తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement