
నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలి
నిర్మల్టౌన్: నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యులు సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిలకు విన తి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పలువురు నకిలీ విలేకరులుగా చలామణి అవుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డీపీఆర్వో కార్యాలయంలో డీపీఆర్వో విష్ణుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, సభ్యులు మనోజ్, అశోక్, రవి, యోగేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.