‘భరోసా’ ఇంకెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

‘భరోసా’ ఇంకెప్పుడు?

May 26 2025 11:57 PM | Updated on May 26 2025 11:57 PM

‘భరోస

‘భరోసా’ ఇంకెప్పుడు?

లక్ష్మణచాంద: పంటల సాగుకు అవసరమైన వి త్తనాలు, ఎరువులు ఇతర ఖర్చుల కోసం గతంలో రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తె చ్చి పంటలు సాగు చేసేవారు. దీంతో వడ్డీ చెల్లించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవా రు. రైతుల పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి అందించి ఆదుకునేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రెండు విడతల్లో ఎకరాకు రూ.10 వేలు రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామి ఇచ్చింది. కానీ గత వానాకాలంలో ఎకరానికి కేవలం రూ.10 వేలు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది.

సాగు పనులు షురూ

జిల్లాలో ఐదు రోజులుగా విస్తారంగా వర్షాలు కు రుస్తున్నాయి. దీంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే పంట చేలలోకి నల్లమట్టి, పశువుల ఎరువు తరలించి పొలమంతా చల్లుతున్నారు. దుక్కులు దున్ని విత్తనా లు వేయడానికి పంటచేలను సిద్ధం చేస్తున్నారు.

4.20 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలో ఈ ఏడాది వానాకాలం 4 లక్షల 20 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నాయని జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో ప్రధానంగా సోయాబీన్‌ 1.10 లక్షల ఎకరాలు, వరి 1.20 లక్షల ఎకరాలు, పత్తి 1.50 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 30 వేల ఎకరాలు, కంది 7 వేల ఎకరాలు, ఇతర పంటలు 3 వేల ఎకరాలలో సాగు కానున్నాయని జిల్లా వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.

పెట్టుబడి సాయం రూ.275 కోట్లు

జిల్లాలోని 19 మండలాల పరిధిలోని 400 గ్రామాలకు చెందిన లక్షా 84 వేల మంది రైతులకు గానూ రైతు భరోసా కింద రూ.275 కోట్లు అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయని డీఏవో అంజిప్రసాద్‌ పేర్కొన్నారు.

ఆందోళన చెందుతున్నాం

రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ఇప్పటి వరకు రైతు భరోసాపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. దీంతో విత్తనాలు, ఎరువులు ఎలా కొనుగోలు చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నాం.

– సాయన్న, రైతు, పొట్టపెల్లి

ఆదేశాలు రాలేదు

రైతు భరోసా నిధుల గురించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం వద్ద రైతులకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి.

– అంజిప్రసాద్‌, డీఏవో, నిర్మల్‌

ఇప్పటికీ ప్రకటన చేయని ప్రభుత్వం

ఎదురుచూపుల్లో రైతులు

అప్పులు తప్పవంటున్న అన్నదాతలు

జిల్లాలో 4.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు

స్పష్టతలేని వైనం...

ఈ సారి ముందస్తుగానే రుతుపవనాలు వచ్చాయి. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నాయి. అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు. కానీ రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో రైతు భరోసా వస్తుందా? రాదా? అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి రైతు భరోసాపై స్పష్టత ఇచ్చి ఖాతాల్లో నగదు జమచేసి ఆదుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

‘భరోసా’ ఇంకెప్పుడు? 1
1/2

‘భరోసా’ ఇంకెప్పుడు?

‘భరోసా’ ఇంకెప్పుడు? 2
2/2

‘భరోసా’ ఇంకెప్పుడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement