
ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి
మార్కెట్ తరలించాలి
పట్టణంలోని గాంధీ కూరగాయల మార్కెట్లో రోడ్లపై వ్యాపారాలు చేయడం వల్ల ఇంద్రనగర్ కాలనీకి వెళ్లడం కష్టంగా మారింది. ఇంద్రనగర్ నుండి విశ్వేశ్వరయ్య మార్గ్ వెళ్లే దారిలో మెయిన్ రోడ్డుపై ఉన్న డివైడర్ క టింగ్ను ఈ కూరగాయల మార్కెట్ వల్ల మూసివేశారు. దీనిని తిరిగి తెరిపించాలి. ఈ విషయంపై కలెక్టర్ చొరవ తీసుకొని సత్వర మే మార్కెట్ను మరో చోటుకు తరలించాలి.
– ఇందిరానగర్ కాలనీవాసులు, నిర్మల్
ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలి
వెంగ్వాపేట్లోని కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యం తరలించి 30 రోజులు కావస్తున్నా ఇప్పటికీ కొనుగోలు చేయడం లేదు. అధికారులు త్వరగా స్పందించి ధాన్యం కొనుగోలు చేసి లారీల్లో తరలించాలి. లేదంటే కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి. – వెంగ్వాపేట్ గ్రామ రైతులు
నా భర్త ఉద్యోగం ఇప్పించాలి
ఎస్డీసీఎల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నా భర్త కృష్ణకాంత్ గతేడాది మృతి చెందాడు. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నా భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. కలెక్టర్గారు మానవతా దృక్పథంతో ఆలోచించి నా భర్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగం నాకు ఇప్పించాలని వేడుకుంటున్నా.
– ఎన్.కల్పన, ఎల్లపెల్లి, నిర్మల్
నిర్మల్టౌన్: ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా అర్జీలు స్వీకరించారు. రైతు రుణమాఫీ, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, విద్య, వైద్యం, తదితర అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును సంబంధిత అధికారులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
దరఖాస్తులు పరిశీలించాలి
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలని, వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై వైద్యశాఖ ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి
ఖానాపూర్ మండలం పాత తర్లపాడు గ్రామ శివారులోని 113 సర్వేనంబర్లో 1990లో ప్రభుత్వం 19 మంది రైతులకు ఒక్కొక్కరికి రెండెకరాల చొప్పున కేటాయించి పట్టాలు కూడా ఇచ్చింది. ఇట్టి భూమిని సాగుచేసుకుంటున్నాం. ఇది అటవీ శాఖ భూమి అంటూ అధికారులు వ్యవసాయ పనులు చేపట్టిన ప్రతీసారి పనులకు ఉపయోగించే టాక్టర్లు, జేసీబీలను సీజ్చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి మా వ్యవసాయ భూమిలో ఎలాంటి ఆంక్షలు విధించకుండా చర్యలు చేపట్టి మా నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి.
– పాత తర్లపాడు గ్రామ రైతులు
పింఛన్ ఇస్తలేరు సారూ..
నిర్మల్ మండలానికి చెందిన షేక్నైమా పుట్టుకతోనే బుద్ధిమాంధ్యం, అంగవైకల్యంతో బాధపడుతోంది. 13 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు దివ్యాంగుల పెన్షన్ రావడంలేదు. తన తల్లి సహాయంతో పలుమార్లు జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చి కలెక్టర్కు తన గోడు వెల్ల బోసుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి

ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి

ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి

ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి

ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి