
అభివృద్ధికి సహకరించాలి
నిర్మల్చైన్గేట్: జిల్లా పర్యాటక అభివృద్ధికి సహకరించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమాంద్ అలీ బుధవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటకశాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డిని కోరారు. జిల్లా కేంద్రంలో రమేశ్రెడ్డిని అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట చెరువు, వినాయకసాగర్, సోన్ మండలం పాక్పట్ల క్రొకోడైల్ పార్క్, శ్యామ్ఘడ్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రమేశ్రెడ్డి జూన్లో సంబంధిత అధికారులను పంపించి అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు అలీ తెలిపారు.