సమస్యల పరిష్కారానికే భూభారతి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే భూభారతి

May 8 2025 12:19 AM | Updated on May 8 2025 12:19 AM

సమస్యల పరిష్కారానికే భూభారతి

సమస్యల పరిష్కారానికే భూభారతి

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌● కుంటాలలో రెవెన్యూ సదస్సు

కుంటాల: భూ సమస్యల పరిష్కారానికే భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ పేర్కొన్నారు. బుధవారం కుంటాల రైతువేదికలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. కుంటాల మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి గ్రామాలవారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ స దస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. భూ రికార్డుల్లో పేరు, విస్తీర్ణం లోపాలు, వారసత్వ భూములు, సాదా బైనామాలు, హద్దుల తగా దాల తదితర సమస్యల పరిష్కారానికి సదస్సులు ఉపయోగపడతాయని తెలిపారు. మండలంలోని రాయపాడ్‌, కుంటాల, వెంకూర్‌ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 67 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు తహసీల్దార్‌ కమల్‌సింగ్‌ తె లిపారు. ఆమె వెంట అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, తహసీల్దార్లు కమల్‌ సింగ్‌, ఎజాజ్‌అహ్మద్‌ఖాన్‌, ప్రవీణ్‌ కుమార్‌, డీటీ నరేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

నిల్వలు పేరుకుపోవడంపై ఆగ్రహం

మండలంలోని అందాకూర్‌ కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోగా కలెక్టర్‌ అభిలాష అ భినవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాకూర్‌ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వసతుల లేమిపై అసంతృప్తి వ్యక్తంజేశారు. 40 కేజీల బస్తాకు మూడు కిలోలు కోత విధిస్తున్నారని రైతులు కలెక్టర్‌ కు తెలిపారు. కొనుగోళ్లలో సిబ్బంది నిర్లక్ష్యం చేసినందుకు కుంటాల పీఏసీఎస్‌కు రూ.2లక్షల జరి మానా విధించారు. వర్షాలు కురిసే అవకాశం ఉ న్నందున కొనుగోళ్లు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు కుంటాలలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆమెవెంట అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement