
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. అయితే వేడి తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయి. వేడిగాలులు వీస్తాయి.
విద్యార్థినుల కుటుంబానికి కేటీఆర్ భరోసా
● ‘సాక్షి’ కథనంపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన కేటీఆర్ ● మలేషియాలో ఉన్న తండ్రిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు..
పెంబి: పెంబి మండలం లోతర్య తండాకు చెందిన అక్కాచెల్లెళ్లు బానావత్ అశ్విని, మంజుల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందా రు. ఈఏపీ సెట్ రాసేందుకు హైదరాబాద్ వెళ్లి, స్వగ్రామం తిరిగి వస్తుండగా నిజామాబాద్ జక్రాన్పల్లి సమీపంలో కారు కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ఈ బంజారా బిడ్డల జీవితం చిన్నవయసులో ముగియడం అందరినీ కలచివేసింది. వారి తండ్రి బానావత్ రెడ్డి మలేషియాలో ఉపాధి నిమిత్తం ఉండగా, కన్న బిడ్డల మరణవార్త తెలిసి రోదిస్తున్నాడు. ఈ విషాద ఘటనపై ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రెడ్డినిస్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈమేరకు ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. మరోవైపు నిజా మాబాద్ నుంచి మృతదేహాలను ఇంటికి చేర్చేందుకు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు పూర్తిచేసేవరకూ పర్యవేక్షించి, ఆర్థిక సాయం అందించారు.
నివాళులర్పిస్తున్న
జాన్సన్ నాయక్

వాతావరణం