బాసర: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు బాసర ట్రిపుల్ఐటీలో నిర్వహిస్తున్న టెక్ ఫెస్ట్ రెండో రోజు శనివారం కొనసాగింది. ముఖ్య అతిథులు ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధరన్, ఏవో రణధీర్సాగి, అసోసియేట్ డీన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులను సందర్శించారు. విద్యార్థుల సృజనను అభినందించారు. ప్రాజెక్టుల్లో ‘పిజోజెక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీ హార్వెస్టింగ్’ అనే ప్రాజెక్ట్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగం ప్రదర్శించింది. ఈ ప్రాజెక్ట్ మెకానికల్ కంపనాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పిజోజెక్ట్రిక్ పదార్థాల ప్రాథమిక అన్వయాన్ని చూపించింది. ఇక ఈసీఈ విభాగ విద్యార్థులు రూపొందించిన ‘యాంటీ సూసైడ్ ఫ్యాన్’ ఆకట్టుకుంది. ఇది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోకుండా నివారిస్తుంది. ఈ పరికరం ఫైలింగ్ ఫ్యా న్స్పై అనూహ్యమైన భారం లేదా అనుమానాస్పద రకమైన లోడ్లను గుర్తిస్తుంది. తద్వారా ఆత్మహత్యను నిరోధిస్తుందని విద్యార్థులు తెలిపారు.
ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న టెక్ ఫెస్ట్