నిర్మల్చైన్గేట్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ నగర కార్యదర్శి మేస్తిర సాయికుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. గత బడ్జెట్లో 7శాతం నిధులే కేటాయించి ఆ మొత్తాన్ని కూ డా పూర్తిగా విడుదల చేయకపోవడంతో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక పేద విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశా రు. విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయిస్తేనే విద్యావ్యవస్థ గాడిలో పడుతుందని తెలి పారు. నాయకులు తేజ, శేఖర్, సాయిప్రసాద్, అజయ్, గణేశ్, సందీప్ పాల్గొన్నారు.