ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
నిర్మల్ రూరల్: ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 6,102 మంది విద్యార్థులకు 5,806 మంది హాజరయ్యారు. 296 మంది గైర్హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 5,438 మంది విద్యార్థులకు 5,172 మంది హాజరవగా, 2,66 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో మొత్తం 664 మంది విద్యార్థులకు 634 మంది హాజరవగా, 30 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి పరుశురాం తెలిపారు.
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన డీఐఈవో
సారంగపూర్: మండల కేంద్రంలోని ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా మాధ్యమిక విద్యాఽధికారి పరశురాం గురువారం సందర్శించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 290 మంది విద్యార్థులు హాజరు కావాల్సి, ఉండగా 281 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారని సీఎస్ శంకర్ జిల్లా మాధ్యమిక విద్యాఽధికారికి తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఐఈవో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కాపీయింగ్కు పాల్పడవద్దని తెలిపారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆయన వెంట సీఎస్ శంకర్, అధ్యాపకులు ఉన్నారు.