రాష్ట్రస్థాయి జిజ్ఞాస ప్రదర్శనలో భైంసా విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి జిజ్ఞాస ప్రదర్శనలో భైంసా విద్యార్థులు

Mar 7 2025 9:33 AM | Updated on Mar 7 2025 9:29 AM

భైంసాటౌన్‌: హైదరాబాద్‌లోని ఇందిర ప్రియదర్శిని కళాశాలలో బుధవారం రాష్ట్రస్థాయి జిజ్ఞాస(డిగ్రీ కళాశాల విద్యార్థుల అధ్యయన ప్రాజెక్టులు)–2025 పోటీలు జరిగాయి. ఇందులో భైంసాలోని జీఆర్‌పీ ప్రభుత్వ డిగ్రీ కళా శాల విద్యార్థులు యోగిత, కీర్తి, అంకిత, నితి న్‌, వంశీ పాల్గొని ‘ఆంగ్ల భాషా పదాల అసమగ్ర అనువాదం కన్నా అనులేఖనం అనువైనది‘ అనే అంశంపై ప్రదర్శన ఇచ్చారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవికుమార్‌, డాక్టర్‌ శంకర్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు రూపొందించిన ట్లు ప్రిన్సిపాల్‌ బుచ్చయ్య తెలిపారు. విద్యార్థులు, పర్యవేక్షక ప్రొఫెసర్లను ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు గురువారం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement