నిర్మల్టౌన్/కడెం/లక్ష్మణచాంద/లోకేశ్వరం/
కుంటాల: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు, బాలికల భద్రతకు ‘పోలీస్ అక్క’ పేరిట ఎస్పీ జానకీ షర్మిల సరికొత్త కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. ప్రతీ నెలలో ఒకరోజు మహిళా కాని స్టేబుళ్లు ప్రభుత్వ బాలికల విద్యాసంస్థలను సందర్శించి హాస్టళ్లలో బస చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 18 పాఠశాలల్లో దీనిని అమలు చేసేందు కు నిర్ణయించారు. ఒక్కో మహిళా కానిస్టేబుల్ ఒ క్కో పాఠశాలను దత్తత తీసుకుని ప్రతీ వారం పాఠశాలను సందర్శించేందుకు ప్లాన్ చేశారు. విద్యార్థిను ల మంచీచెడు తెలుసుకుని సైబర్ క్రైమ్, బ్యాడ్.. గుడ్ టచ్పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ విషయంపై బుధవారం సంబంధిత పోలీస్ అధికారులు, మహిళా కానిస్టేబుళ్లతో ఎస్పీ జూమ్ మీటింగ్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కేజీబీవీల్లోని విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాలని, నెలకోసారైన పాఠశాలను సందర్శించాలని ఆదేశించారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని, వారిలో మనోధైర్యం నింపాలని సూచించారు. మ హిళా దినోత్సవం సందర్భంగా కేజీబీవీల్లోని విద్యార్థినుల భద్రతకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలి పారు. 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ నిర్వహించి విద్యార్థినులు సమస్యలు ఎలా అధిగ
మించాలో వివరిస్తామని చెప్పారు. వారి సమస్యలు అర్థం చేసుకుని కౌన్సిలింగ్ ఇస్తామని వివరించారు. జూమ్ మీటింగ్లో అదనపు ఎస్పీలు పాల్గొన్నారు.
లక్ష్మణచాంద మండల కేంద్రంలో..
లక్ష్మణచాంద మండల కేంద్రంలోని కేజేబీవీలో ‘పోలీస్ అక్క’ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్సై సుమలత హాజరై మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు ‘బాలికల భద్రత–మా బాధ్యత’ నినా దంతో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కడెం మండల కేంద్రంలో..
మహిళలు, బాలికల సంరక్షణకు ఎస్పీ జానకీ షర్మి ల మహిళా దినోత్సవం రోజున ప్రారంభించనున్న ‘పోలీస్ అక్క’ కార్యక్రమంపై కడెం మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థలు, పని ప్రదేశాల్లో మహిళా సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.
లోకేశ్వరం మండల కేంద్రంలో..
లోకేశ్వరం మండల కేంద్రంలోని కేజీబీవీలో ‘పోలీస్ అక్క’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు బాలికల భద్రతపై మహిళా కానిస్టేబుల్ వినిత అవగాహన కల్పించారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబాల్లో ఎలాంటి సమస్యలున్నా పోలీసులకు తెలుపాలని సూచించారు.
కుంటాల మండలం కల్లూరులో..
కుంటాల మండలం కల్లూరు గ్రామంలోని కేజీబీవీ లో ‘పోలీస్ అక్క’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్సై భాస్కరాచారి బుధవారం రాత్రి బస చేశారు. మహిళల హక్కులపై విద్యార్థినులకు అవగాహన క ల్పించారు. ఇన్చార్జి ఎస్వో సంధ్యారాణి, కానిస్టేబు ల్ అశ్విని తదితరులు పాల్గొన్నారు.
వినూత్న సేవలకు ఎస్పీ శ్రీకారం
విద్యార్థినుల భద్రతకు భరోసా
కేజీబీవీల్లో ‘పోలీస్ అక్క’
కేజీబీవీల్లో ‘పోలీస్ అక్క’