
పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరం
● డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్
దిలావర్పూర్: గ్రామీణ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు ధరి చేరవని జిల్లా వైద్యారోగ్య శాఖ ఇన్చార్జి అధికారి డాక్టర్ రాజేందర్ అన్నారు. దిలావర్పూర్లో కొన్న రోజులుగా జ్వరాలు ప్రబ లుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం గ్రామంలో ఇంటింటా జ్వర సర్వే చేపట్టారు. సర్వే తీరును రాజేందర్ పరిశీలించారు. సిబ్బందికి, ప్రజలకు సూచనలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. కొద్దిపాటి జ్వరం వచ్చినా పీహెచ్సీ వైద్యులను సంప్రదించాలని తెలిపారు. అధిక జ్వరం ఉంటే రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. స్థానిక పీహెచ్సీలో వైద్యులను సైతం అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఈసందర్భంగా దిలావర్పూర్లో పలు వార్డుల్లో జ్వరపీడితులను ఆయన పరిశీలించి కొందరిని అంబులెన్స్లో నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జ్వరాలు తగ్గుముఖం పట్టేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఆయన వెంట డీపీవో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్యాంకుమార్, సీహెచ్వో రాజేశ్వర్, ఆశ కార్యకర్త శోభ, వైద్యారోగ్య సిబ్బంది ఉన్నారు.