లిక్కర్‌ స్కాం కేసు: ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు.. | ED Issued Notices To MLC Kavitha Over Delhi Liquor Scam Case | Sakshi
Sakshi News home page

విచారణకు రండి.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

Jan 15 2024 6:32 PM | Updated on Jan 15 2024 7:23 PM

ED Issued Notices To MLC Kavitha Over Delhi Liquor Scam Case - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తాజాగా నోటీసులు పంపించింది. 

వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు సోమవారం నోటీసులు పంపింది. రేపు(మంగళవారం) ఈ కేసులో విచారణను హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. దీంతో, మరోసారి తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారింది. అయితే, కవిత విచారణకు వెళ్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. గతేడాది మార్చిలో కవితను ఈడీ పలుమార్లు విచారించింది. కాగా, ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

మరోవైపు.. లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికి నాలుగుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చిన ఆయన హాజరుకాలేదు. ఇక, లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఇవి కూడా చదవండి: 

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు..

ఈడీ హీట్‌.. సుప్రీంకోర్టుకు ఎమ్మెల్సీ కవిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement