దలైలామాకు గాంధీ–మండేలా అవార్డు

Dalai Lama conferred Gandhi Mandela Award in Himachal Pradesh - Sakshi

ధర్మశాల: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా గాంధీ–మండేలా పురస్కారం అందుకున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రా జిల్లా ధర్మశాల సమీపంలోని మెక్లాయిడ్‌ గంజ్‌లో శనివారం గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ పురస్కారం ప్రదానం చేశారు.

యుద్ధం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని దలైలామా అన్నారు. గాంధీ, నెల్సన్‌ మండేలా ఆశయసాధనకు పోరాడే ఆసియా, ఆఫ్రియా దేశాల నేతలకు గాంధీ–మండేలా ఫౌండేషన్‌ 2019 నుంచి పురస్కారాలను ప్రదానం చేస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top