దొడ్డబళ్లాపురం: కస్టమ్స్ అధికారిణిపై అత్యాచారం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యాపారవేత్తను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వివరా లు.. స్థానిక మహిళా కస్టమ్స్ సూపరింటెండెంట్కి ఎం.కృపలాని అనే వ్యాపారవేత్తకు 9 ఏళ్లుగా పరిచయం ఉంది.
ఇద్దరి మధ్య సన్నిహిత వ్యవహారాలను ఆసరాగా చేసుకుని కృప లాని ఎలక్ట్రా నిక్స్ వస్తువుల వ్యాపారంతో పాటు అనేక దొంగ వ్యాపారాలు చేస్తూ కస్టమ్స్ శాఖను మోసగిస్తూ వచ్చాడు. అధికారిణి వ్యక్తి గత ఫొటోలు, వీడియోలను చూపి అత్యాచారం చేయడంతో పాటు బ్లాక్మెయిల్ చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


