5.4 Magnitude Earthquake Tremors Felt In Delhi Parts Of North India - Sakshi
Sakshi News home page

ఉత్తరాదిని వణించిన భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.7గా నమోదు

Jun 13 2023 2:00 PM | Updated on Jun 13 2023 2:20 PM

5 4 Magnitude Earthquake Tremors Felt In Delhi Parts Of North India - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1:30 తర్వాత సంభవించిన భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. ఢిల్లీ, చండీగఢ్‌, పంజాబ్‌లో ప్రకంపనలు వచ్చాయి. జమ్మూకశ్మీర్‌ని శ్రీనగర్‌లో భూమి బలంగా కంపించింది. దోడా జిల్లాలోని గండోహ్ భలెస్సా గ్రామ సమీపంలో 5.7 తీవ్రత నమోదైంది. మణిపూర్‌లో స్వల్పంగా భూమి కంపించగా.. పాకిస్థాన్‌లోని లాహోర్‌లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి.

అయితే భూకంపం దాటికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు. భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పలువురు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. వీటిని చూస్తుంటే భూకంపం ప్రభావంతో ఇంట్లోని వస్తువులు ఊగిపోతున్నట్లు కనిపిస్తుంది. కాగా ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో గత నెల చివర్లో ఢిల్లీలో తేలికపాటి ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement