ప్రజావాణికి 46 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 46 దరఖాస్తులు

Jul 29 2025 4:36 AM | Updated on Jul 29 2025 9:08 AM

ప్రజావాణికి 46 దరఖాస్తులు

ప్రజావాణికి 46 దరఖాస్తులు

నారాయణపేట: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరగా పరిష్కరించాలని అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్ల క్ష్యం వహించొద్దని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement