
మత్స్య సంపదకూ ముప్పే..
నీటి కాలుష్యంతోపాటు గుర్రపు డెక్క కూడా కృష్ణానదిలో విస్తరిస్తోంది. ఎగువ నుంచి కిందకి నీళ్లు వచ్చినప్పుడు తీరప్రాంతాల్లోని చెత్తాచెదారంతోపాటు గుర్రపు డెక్క కూడా వస్తోంది. ఇది శ్రీశైలం డ్యాం వరకు నిదానంగా చేరుతోంది. కాలుష్యం, గుర్రపుడెక్క కారణంగా నదిలోని మత్స్య సంపదకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అలివి వలల కారణంగా నదిలో చేపలు పెరగడం లేదు. కాలుష్యం కూడా దీనికి తోడైతే మత్స్యకారుల జీవనోపాధికి ఇక్కట్లు తప్పవు.
కృష్ణానదిలో విస్తరిస్తున్న గుర్రపు డెక్క