మోగనున్న బడిగంట | - | Sakshi
Sakshi News home page

మోగనున్న బడిగంట

Jun 12 2025 3:03 AM | Updated on Jun 12 2025 3:05 AM

నారాయణపేట రూరల్‌: నెలన్నర రోజుల సుదీర్ఘ విరామం అనంతరం నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలు ఆట, పాటలతో ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండటంతో గురువారం నుంచి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 13మండలాల్లో 339 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత, 76 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అలాగే 11 కేజీబీవీలు, రెండు మోడల్‌, 7 గురుకుల, 4 మాహత్మాపూలే, రెండు మైనార్టీ, రెండు ఎయిడేడ్‌లతో పాటు 142 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 1.30లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలకు మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్‌ ద్వానా నీరు అందడంలేదు. దీనికి తోడు స్వచ్ఛవిద్యాలయ పేరుతో పాఠశాలలో నిర్మించిన టాయిలెట్స్‌ వృథాగా ఉన్నాయి. చాలా చోట్ల విద్యార్థుల సంఖ్య, తరగతులకు అనుగుణంగా గదులు లేక ఒకే చోట కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. కొన్ని చోట్ల భవనాలు శిఽథిలావస్థకు చేరుకున్నాయి. మరి కొన్ని చోట్ల నిర్మాణ పనులు పూర్తికాక దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పుస్తకాలు, యూనిఫామ్స్‌ సిద్ధం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడేడ్‌, గురుకుల, కేజీబీవీ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాల కోసం ఆయా ఎమ్మార్సీల నుంచి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు 90శాతం పాఠ్యపుస్తకాలు ఇప్పటికే ఎమ్మార్సీకి చేరాయి. వీటిని అన్ని పాఠశాలలకు పంపించగా గురువారం ప్రతి విద్యార్థికి అందించనున్నారు. అదేవిధంగా 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నోటుపుస్తకాలను అందిస్తుండగా, ప్రాథమిక తరగతులకు సైతం ఈ సారి నోటు పుస్తకాలు ఇస్తున్నారు. ఇక విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫామ్స్‌ విషయంలో కొంత వెనకబడి ఉన్నారు. ఒక్కో విద్యార్థికి బడి తెరిచే రోజు ఒక్క డ్రస్‌ అయిన ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, తరగతి గదులను శుభ్రం చేసి.. పాఠశాల అందంగా అలకరించాలని, అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థులకు గతంలో పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలు, మార్కులతో బ్యానర్‌లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల హెచ్‌ఎంను ఆదేశించారు. ఇక టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తూ పిల్లలను పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే, విద్యాబోధనలో మార్పులకు వేసవి సెలవుల్లో టీచర్లకు శిక్షణ ఇచ్చారు.

నేడే పాఠశాలల పునఃప్రారంభం

కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం

పుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫామ్స్‌ సిద్ధం

స్కావెంజర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు శిక్షణ పూర్తి

మోగనున్న బడిగంట1
1/1

మోగనున్న బడిగంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement