నారాయణపేట: తనపై నమ్మకంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ను కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ఖర్గే, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, బావి ప్రధాని రాహుల్గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణులను సమన్వయంతో చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామగ్రామన జెండా ఎగరవేస్తూ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండాలను ఎగరవేసేందుకు కృషి చేస్తామన్నారు.
బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి
నారాయణపేట: యాసంగిలో వరి ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనేప్రభుత్వం బోనస్ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్గంగ్వార్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లాలో 14.25 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని, అందుకుగాను రూ.71 కోట్లు బోనస్ చెల్లించాల్సి ఉందన్నారు. రైతులు ధాన్యం విక్రయించి రెండునెలలు కావస్తున్నా ఇంత వరకు బోనస్ డబ్బులు వేయాలేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులు చెల్లించాలని కోరారు. శివకుమార్, శ్రీనివాస్, శరణుబసప్ప పాల్గొన్నారు.
అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ఆసక్తి గల నూతన, రిటైర్డ్ గెస్టు లెక్చరర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిలాసఫీ సోషియాలజీ, జీవవశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితం, సోషల్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఐసీటీ, ఆరోగ్య వ్యాయామ విద్య, విజువల్ ఫర్మామింగ్ ఆర్ట్స్లో ఒక్కొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈ నెల 19లోగా మెట్టుగడ్డ వద్ద ఉన్న బీఈడీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెమిస్టర్– 1, 3 సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్–1లో 37.74 శాతం, సెమిస్టర్–3లో 42.11 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికార వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే