
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
నారాయణపేట: ఎస్పీ యోగేష్ గౌతమ్ను జిల్లా ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేశ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత కార్యక్రమంలో పాల్గొంటూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు. సంబంధిత అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి నెల కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ సేప్టీ మీటింగ్కు రావాలని సూచించారు. జాతీయ రహదారి 167 రాయచూరు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయని, వాటి నివారణకు సంబంధిత అధికారులు నిర్వహించే రోడ్డు భద్రతా మహోత్సవాలకు ఇక నుంచి భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని, స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. ఇక ముందు జరిగే రోడ్డు భద్రతకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పోలీసు శాఖ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కురువ మనోజ్, నాయకులు సిద్దన్ లక్ష్మణ్, జరంగ్ రాము, గోల్ల లక్ష్మణ్, వీరేష్ కుమార్, కార్తీక్, అసనుద్దీన్ పాల్గొన్నారు.