
ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతాం..
కోస్గి రూరల్: నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కళాశాల, వెటర్నరి కళాశాల, ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలలు చేపడుతున్నామని కొడంగల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి, కడా చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. గురువారం ప్రభుత్వ ఇంజినీరింగ్, మహిళా డిగ్రి కళాశాలల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనకబడిన కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ఉన్నత చదువులకు సూదూర ప్రాంతాలకు గతంలో వెళ్లాల్సి వచ్చేదని ప్రస్తుతం తమ ప్రాంతంలోనే కళాశాలలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో విద్యాభ్యున్నతి మరింత పెరుగుతుందన్నారు. కార్పొరేట్ కళాశాలలకు ఫిజులు చెల్లించలేని వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్లవిజయ్కుమార్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, నాయకులు రఘువర్దన్రెడ్డి, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.