
కనులపండువగా ‘రైతుల పండుగ’
భూమిని.. పశువులను.. సేద్యానికి అవసరమైన పరికరాలను.. మొత్తంగా ప్రకృతిని పూజించే.. అన్నదాతల అతిపెద్ద పండుగ ఏరువాక పున్నమిని జిల్లాలోబుధవారం ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. రైతులు ఉదయాన్నే ఎడ్లను కడిగి పూల దండలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. నైవేద్యాలు సిద్ధం చేసి మంగళ వాయిద్యాలతో పొలాల వద్దకు కుటుంబసభ్యులతో కలిసి ఊరేగింపుగా వెళ్లారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని.. పంటలు బాగా పండాలని భూతల్లికి పూజలు చేసి పొలం దున్నడం ప్రారంభించారు. సాయంత్రం గ్రామాల్లో
ఏరువాక తోరణాలు కట్టి తమ పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా ఆనందోత్సాహాలతో పరుగులు పెట్టించారు.
– సాక్షి నెట్వర్క్
మద్దూరు మండలం నందిపాడ్ ఆలయం చుట్టూ ఎద్దుల ఊరేగింపు
నర్వలో ఎద్దుల ఊరేగింపులో హారతులు పడుతున్న మహిళలు
ఎద్దులను పరుగెత్తిస్తున్న యువకులు

కనులపండువగా ‘రైతుల పండుగ’

కనులపండువగా ‘రైతుల పండుగ’