మంత్రి వాకిటి శ్రీహరికి ఘనస్వాగతం | - | Sakshi
Sakshi News home page

మంత్రి వాకిటి శ్రీహరికి ఘనస్వాగతం

Jun 11 2025 11:44 AM | Updated on Jun 11 2025 11:44 AM

మంత్రి వాకిటి శ్రీహరికి ఘనస్వాగతం

మంత్రి వాకిటి శ్రీహరికి ఘనస్వాగతం

మక్తల్‌/మరికల్‌: రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన వాకిటి శ్రీహరి మంగళవారం మొదటిసారిగా మక్తల్‌ నియోకవర్గానికి రావడంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. మరికల్‌లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి గజమాలతో సత్క రించి స్వాగతం పలకగా.. గుడిగండ్ల, జక్లేర్‌, బొందలకుంట, కాచ్‌వార్‌ గ్రామాల్లో మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి పూలమాలలతో సత్కరించారు. గుడిగండ్ల నుంచి మక్తల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దండు క్రాసింగ్‌ వద్ద ఉన్న బసవేశ్వరుడు విగ్రహానికి, నల్లజానమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భగత్‌సింగ్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామిని మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రావడంపై సంతోషం వ్యక్తంచేస్తూ.. నర్వ మండలం రాయికోడ్‌కు చెందిన ఆనంద్‌ శ్రీనల్లజానమ్మ ఆలయంలో 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర గౌడ సంఘం చైర్మన్‌ నాగరాజుగౌడ్‌, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, గణేశ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement