ధరలను తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

ధరలను తగ్గించాలి

Jun 10 2025 3:18 AM | Updated on Jun 10 2025 3:18 AM

ధరలను

ధరలను తగ్గించాలి

తేడాది 30 కిలోల జీలుగ బస్తా రూ.1,116 ఉంటే ఈ ఏడాది 2,137కి పెంచడంతో పిల్లి పెసర విత్తనాలను పొలంలో చల్లుతున్నాం. ఇప్పటికే పంటల పెట్టుబడులు తడిసి మోపెడు అవుతుంటే, జీలుగ విత్తనాల ధర కూడా భారీగా పెరగడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. రైతుల కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకొని పెరిగిన జీలుగ విత్తనాల ధరలను తగ్గించాలి.

– భాస్కర్‌రెడ్డి, రైతు, మరికల్‌

జీలుగ స్థానంలో పెసర వేస్తున్నాం

జీలుగ విత్తనాల ధరలు పెంచడంతో వాటి స్థానంలో భూమి సారం కోసం పిల్లి పెసర వేస్తున్నాం. ఎకరాకు వరి సాగుకు రూ.35 వేల పెట్టుబడి అవుతుంది. జీలుగ విత్తనాల ధరలు పెరగడం వల్ల అదనపు భారం పడుతుంది. అదే స్థాయిలో నేలకు సారం అందజేసే పెసరను పొలంలో చల్లుతున్నాం. ప్రభుత్వం స్పందించి గతేడాది మాదిరిగానే జీలుగ విత్తనాలను రైతులకు అందజేయాలి.

– సురేష్‌, రైతు, కన్మనూర్‌

ప్రభుత్వం నిర్ణయించిన ధరలే..

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు జీలుగ, జనుము, విత్తనాలను అందజేస్తున్నాం. ధరలు పెరిగాయని జీలుగ సాగు చేయడం మానేస్తే పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. తప్పకుండా ఒక హెక్టార్‌కు 30 కిలోల జీలుగ, 40 కిల్లోల జనుము విత్తనాలు వేయాలి.

– జాన్‌సుధాకార్‌,

జిల్లా వ్యవసాయ అధికారి

ధరలను తగ్గించాలి 
1
1/1

ధరలను తగ్గించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement