రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి

May 4 2025 6:20 AM | Updated on May 4 2025 6:20 AM

రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి

రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి

నారాయణపేట రూరల్‌: జిల్లా న్యాయ సేవ సంస్థ లీగల్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని బోయిన్పల్లి, అప్పకపల్లి గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ విజ్ఞాన సదస్సును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కే.సురేష్‌, డిఫెన్స్‌ కౌన్సిల్‌ లక్ష్మీపతి గౌడ్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్సె కౌన్సెల్‌ నాగేశ్వరి పాల్గొని న్యాయ విజ్ఞాన సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. న్యాయ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన హక్కులు కల్పించిందని, ప్రజలు వాటిపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ హక్కులను నిర్భయంగా పొందుతారని తెలిపారు. ప్రజలందరు సమానమేనని ఉన్నవాళ్లు, పేదవాళ్లు అని తేడా లేదని, పేదరిక నిర్ములనా, సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా మరియు ప్రజలు చైతన్యంగా ఉంటేనే అన్ని హక్కులు సాధ్యమవుతాయని వివరించారు. జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సంస్థ ద్యారా పేదలకు ఉచిత న్యాయాన్ని పొందవచ్చు అని, మహిళలకు రక్షణ చట్టం ఉందని అన్నారు. వేధింపులకు గురైతే బాధితులకు సఖి, భరోసా సెంటర్లు అండగా ఉంటాయని అన్నారు. అలాగే, న్యాయ సలహాల కోసం 15100 నెంబర్‌కు ఫోన్‌ చేసి తమ సమస్యను చెప్తే ఈ సంస్థలో పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో పంచాయత్‌ సెక్రటరీలు ఎండి జావిద్‌, విజయకుమార్‌, పార లీగల్‌ వాలంటీర్‌, రూపిక, యాదమ్మ, లక్ష్మి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement