
‘దోస్త్’ మొదటి విడతలో 94 మందికి సీట్ల కేటాయింపు
మద్దూరు: మద్దూరు డిగ్రీ కళాశాలలో దోస్త్ ద్వార మొదటి విడతలో 94 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు, వీరి జూన్ 5 లోపు అడ్మిషన్లు పొందాల్సిందిగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి. కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం కళాశాల అవరణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోస్టర్, కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 2025–26 విద్యాసవంత్సరానికి గాను డిగ్రీ కళశాలలో 240 సీట్లగాను మొదటి విడతలోనే 94 మంది సీట్లు కేటాయించామని అన్నారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ సౌకర్యంతో పాటు, అన్ని సబ్జెక్టు బోధించడానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులు, తరగతి గదులు, క్రీడా సౌకర్యంతో పాటు ప్రతి రోజు ఓ ఉపన్యాసకుడిచే వివిధ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులకు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళశాలలో చేరాలని సూచించారు. కార్యక్రమంలో ఉపన్యాసకులు జనార్ధన్, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.