
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా నూతన జడ్జి బోయ శ్రీనివాసులును శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. కోర్టు కార్యాలయంలో కలిసి పూలమొక్క అందజేశారు.
విద్యార్థులకు అభినందనలు..
నర్వ: పీఎంశ్రీ పథకానికి ఎంపికై న మండలంలోని పాథర్చేడ్ ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 550 మార్కులు సాధించిన పాఠశాలకు చెందిన విద్యార్థిని అమృతను శాలువాతో పాటు ప్రశంసాపత్రాన్ని కలెక్టర్, డీఈఓ గోవిందురాజులు అందించారు. పాఠశాలలో వంద శాతం ఫలితాలను సాధించేలా కృషి చేసిన హెచ్ఎం కృష్ణయ్యను అభినందించారు.