
10 రోజులుగా తిరుగుతున్నా..
12 ట్రాక్టర్ల ధాన్యం ఆరబెట్టి పది రోజులవుతుంది. ఆ రోజు నుంచి సంచుల కోసం తీలేర్ కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నాను. ఇంకా సంచులు రాలేదు.. వస్తే ఇస్తామని చెప్పి పంపిస్తున్నారు. సకాలంలో సంచులు ఇవ్వకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. మళ్లీ ఆరబెట్టి రాశులుగా పోసి కవర్లు కప్పి ఉంచాం. త్వరగా సంచులు ఇచ్చి ధాన్యం తరలించేందుకు అధికారులు చొరవ చూపాలి.
– దూలప్ప, రైతు, రాకొండ
అధికారుల పొరపాటు వల్లే..
పంట కోత వేయక ముందే రాజకీయ బ లం ఉన్నా రైతులకు ముందే సంచులు ఇ వ్వడం వల్ల తమలాంటి ధాన్యం ఆరబెట్టిన రైతులకు సంచులు దొరకడం లేదు. రోజుల తరబడి సంచుల కోసం కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాం. ఆరిన ధాన్యం పరిశీలించిన తర్వాతనే సంచులు ఇవ్వాలి. కానీ అధికారులు చేసే పొరపట్ల వల్ల ఇతర రైతులకు నష్టం జరుగుతుంది.
– శ్రీనివాసులు, రైతు, పెద్దచింతకుంట
25 లక్షల బ్యాగులు పంపిణీ చేశాం..
జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు 25 లక్షల గన్నీ బ్యాగులను అందజేశాం. అయితే రైతులు పంటలు కోత వేయక ముందే సంచులు తీసుకెళ్లడం వల్ల ఇతర రైతులకు సంచులు దొరకడం లేదు. ఆ పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటాం. రెండు రోజుల్లో మరో 5 లక్షల గన్నీ బ్యాగులను తెప్పించి రైతులకు కొరత లేకుండా చూస్తాం.
– సైదులు, జిల్లా సివిల్ సప్లయ్ డీఎం
●

10 రోజులుగా తిరుగుతున్నా..