
భూ భారతితో భూ సమస్యల పరిష్కారం
కోస్గి రూరల్/మద్దూరు: ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు నూతన భూ భారతి చట్టంతో పరిష్కారం లబిస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం కోస్గి, మద్దూరులో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఎర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధరణిలో ఉన్న సమస్యలను తొలగించి రైతు సంఘాలు, రెవెన్యూ అధికారులు, మేధావులతో చర్చలు జరిపి ప్రభుత్వం నూతన చట్టం భూ భారతిని తీసుకువచ్చిందన్నారు. ధరణి పోర్టల్లోని 32 అంశాలను తొలగించి 11 అంశాలతో భూ భారతి చట్టంతో భూ సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికి భూదార్ కార్డును అందజేయనున్నామని అన్నారు. కింది స్థాయి అధికారులు పొరపాట్లు చేస్తే నన్యాయం కోసం పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని, 99శాతం భూ సమస్యలు తహసీల్దార్ వద్దే పరిష్కారం అవుతాయని, 30 రోజుల్లో మ్యుటేషన్లు పరిష్కారం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్,ి తహసీల్దార్లు బక్క శ్రీనివాస్, భాస్కరస్వామి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు భింరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారం
తహసీల్దార్ స్థాయిలోని సమస్యలను మోకా మీదనే పరిష్కరించాలని తహసీల్దార్ మహేష్గౌడ్కు కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం మద్దూరు మండలంలోని దమ్గాన్పూర్, నాగిరెడ్డిపల్లిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు. రెవెన్యూ సదస్సులను వేగవంతం చేయాలని, సదస్సుల్లో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు ఏ సమస్యలపై ఎక్కువగా వచ్చాయని ఆరా తీశారు. అనంతరం వచ్చిన దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, తదితర ఆంశాలపై మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి ప్రత్యేకాధికారి యాదగిరి, అడిషన్ కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, ఆర్డీఓ రాంచందర్నాయక్, భూ భారతి కోసం నియమించిన తహసీల్దార్, ఆర్ఐ, ఇతర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మద్దూరు మండలంలో తలెత్తిన సమస్యలను వారి పరిష్కారం కోసం చేస్తున్న కసరత్తుపై అధికారులతో ఆమె సుదీర్ఘంగా చర్చించారు.