డీజీపీఎస్‌ పరికరం ఏమైంది ? | - | Sakshi
Sakshi News home page

డీజీపీఎస్‌ పరికరం ఏమైంది ?

Apr 26 2025 12:20 AM | Updated on Apr 26 2025 12:20 AM

డీజీపీఎస్‌ పరికరం ఏమైంది ?

డీజీపీఎస్‌ పరికరం ఏమైంది ?

భూ సర్వే చేయడానికి అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించాలని గత కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తన గ్రాంట్‌ నుంచి డీజీపీఎస్‌ పరికరాన్ని కొనుగోలు చేయించి గతేడాది మార్చి 15న జిల్లా సర్వేయర్ల అధికారుల బృందానికి అప్పగించారు. కానీ పేట – కొడంగల్‌ ప్రాజెక్టు సర్వేలో ఇరిగేషన్‌ అధికారులు డీజీపీఎస్‌ పరికరాన్ని వాడితే.. సర్వేయర్లు బృందం జీపీఎస్‌ పరికరంతో సర్వే చేపట్టారు. దీంతో ఇరిగేషన్‌, సర్వేయర్లు చేపట్టిన సర్వేలో లెక్కలు తేడా ఉందని, హద్దులు సరిగ్గా చూయించలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. అసలు ఆ పరికరాన్ని ప్రభుత్వ భూముల సర్వేలో అక్కడక్కడ వినియోగిస్తూ.. ప్రైవేట్‌ సర్వేలకు ఎక్కువగా వినియోగిస్తున్నరని తెలుస్తోంది. దీనిపై కలెక్టర్‌ దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలాఉండగా, భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహరం సీఎం ఇలాఖాలో ఎంత వస్తుందో.. నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గంలో రైతులకు అంతే వస్తుందని ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి భరోసానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement