
అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
నారాయణపేట టౌన్: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రజల నుంచి గుర్తింపు లభిస్తుందని.. ఉత్తమ సేవలు అందించాలని హోంగార్డు ఇన్చార్జ్ ఆఫీసర్ (ఆర్ఎస్ఐ) మద్దయ్య అన్నారు. జిల్లా నుంచి మహబూబ్నగర్కు బదిలీపై వెళ్తున్న 60మంది హోంగార్డులకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ కాన్ఫరెన్స్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఇన్నాళ్లు అంకితభావంతో పనిచేసిన హోంగార్డ్లందరికీ అభినంధనలు తెలిపారు. ఇక ముందు కూడా బాగా పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఆకాంక్షిచారు. వీరి స్థానంలో మహబూబ్నగర్ జిల్లా నుంచి 61 మంది హోంగార్డ్లు ఇక్కడికి రాన్నునట్టు తెలిపారు. స్థానికంగా మహబూబ్నగర్ వారై ఇక్కడ పనిచేస్తూ ఎస్పీ చొరవతో తమ సొంత జిల్లాకు బదిలీపై వెళ్తున్నందున ఎస్పీ యోగేష్గౌతమ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.